తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరంలోని వివేకానంద కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో స్నానాలు చేస్తూ నీటి ప్రవాహానికి ఈత రాక మునిగి గల్లంతయ్యారు.
సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలు సంఘటన స్థలానికి కొంత దూరంలో లభ్యమయ్యాయి, సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.