అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని మెరైన్ పోలీసులు రక్షించారు. వాడరేవు-రామాపురం దారిలో ఉన్న సముద్రంలో స్నానానికి ముగ్గురు దిగారు. ప్రమాదవశాత్తు వారు నీట మునిగారు. వారిలో ఒకరిని మెరైన్ పోలీసులు కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇంకొల్లుకు చెందిన వెంకటమారుతి, షేక్అఫ్రిది ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు వేటపాలెం బండ్ల బాపయ్య కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.