హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : ఏపీలోని కాకినాడ జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు నాటు పడవపై చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ఈదురు గాలుల, సముద్ర అలలకు పడవ బోల్తా పడింది.
దాంతో ఐదుగురు జాలర్లు సముద్రంలో గల్లంతయ్యారు. ముగ్గురు జాలర్లు ఈదుకుంటూ తీరానికి చేరుకొన్నారు. మిగతావారి కోసం మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు.