అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, కృష్ణ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి . బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీకి చెందిన నాయకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
చంద్రగిరి నుంచి చిలకలూరిపేటకు బయలు దేరిన టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యలో లారీని ఢీ కొనగా చంద్రగిరి మండలం టీడీపీ యూత్ అధ్యక్షుడు భానుప్రకాశ్(31) మృతి మృతి చెందాడు. తిరుపతి జిల్లా టీడీపీ కార్యదర్శి గంగుపల్లి భాస్కర్కు గాయాలయ్యాయి.
కృష్ణ జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారి వద్ద లారీని వెనుకనుంచి కారు ఢీ కొనగా ఏపీ జెన్కో ఉద్యోగి వరప్రసాద్ భార్య మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.