అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పుడి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో వీరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో కాశింపీరా(60), గల్లా పేరమ్మ(60) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.