అమరావతి : అనంతపురం జిల్లాలోని గుత్తిలో రోడ్డు దాటుతున్న చిన్నారుల పైకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. చిన్నారులు మేనమామతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ వీరిపై ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.