తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వచ్చేనెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు బుక్చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు సింహ వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభం కానుంది.