TTD | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.
శ్రీవారి ఆర్జిత సేవలు, లకీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ ఈ నెల 18 నుంచి 24 వరకు జారీ చేసింది. ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు 2గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలుచేశారు.