Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
ముఖ్యంగా కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు.