తిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. అలాగే జూన్ 1 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేసింది. ఉదయం 10 గంటలకు బదులు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలకు అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. గురువారం ఆగస్ట్ నెల గదుల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.