తిరుపతి : తిరుమల(Tirumala)లోని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 10 లక్షల విరాళాన్ని అందించింది. మహతి ఆడిటోరియంలో గురువారం ఆ సంస్థ తిరుపతి ప్రతినిధి రాఘవేంద్ర ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,382 మంది భక్తులు దర్శించుకోగా 27,478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.25 కోట్లు వచ్చిందని తెలిపారు.