తిరుమల : తిరుమల,తిరుపతి దేవస్థానం పరిధిలోని పలు ట్రస్టులకు నలుగురు భక్తులు భారీ విరాళాలను (Donation) అందజేశారు. సుమారు రూ.40 లక్షలను డీడీల రూపేణా టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డికి శుక్రవారం అందజేశారు. హైదరాబాద్కు చెందిన జేకేసీ ప్రాజెక్టు (JKC Project) అధినేత కెవి. రాజశేఖర్ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కొల్లి గోపాలకృష్ణ, కొల్లి మాదవ్ రూ.10 లక్షల చొప్పున ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, న్యూఢిల్లీకి చెందిన శివాంగ్ కౌర్ తరుఫున బర్డ్(Birrd) ట్రస్టుకు వి. మణిరెడ్డి, వై.రాఘవేంద్ర రూ.10 లక్షలను అందజేశారు.