తిరుమల : తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్ల(Compartments)లో వేచియున్నారు.
టోకెన్లు ( Tokens, )లేని భక్తులకు సర్వదర్శనం(Sarvadarsanam) 12 గంటల్లో అవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని76,392 మంది దర్శించుకోగా 36,248 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 2.83 కోట్లు వచ్చిందన్నారు.