తిరుపతి : బెంగళూరు(Bangalore) నగరంలోని వయ్యాలికావల్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి(Pushkarini), కళ్యాణకట్ట(Kalyanakatta)ను ఆదివారం టీటీడీ(Ttd) ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రూ.7 లక్షల వ్యయంతో పుష్కరిణి నిర్మించామని, తిరుమలకు రాలేని భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించి, స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కళ్యాణకట్ట, ప్రసాదాల విక్రయ కేంద్రం, టీటీడీ ఉత్పత్తుల విక్రయ కేంద్రం, టీటీడీ సేవా టికెట్ల కౌంటర్(Ticket Counter) ను ఆయన ప్రారంభించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న వేంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు సంపత్ రవి నారాయణన్, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ అడిగ, కార్యదర్శి భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.