హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తిరుమలలో ఈ నెల 3 నుంచి 5 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అక్కడ జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల సంస్థల ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. వారి సలహాలు, సూచనలతో ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు.
శ్రీవారి దర్శనానికి వచ్చిన బస్సు డ్రైవర్ హత్య
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బస్సు డ్రైవర్ హత్యకు గురయ్యారు. పాత తిరుచానూరు రోడ్డులోని ప్రైవేటు వాహనాలు నిలిపే స్టాండ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. 55 మంది శ్రీవారి భక్తులతో ఛత్తీస్గఢ్ కోబ్బా నుంచి తిరుపతికి బస్సు వచ్చింది. మృతుడు అలహాబాద్కు చెందిన చంద్రసేన్ తివారి(52)గా గుర్తించారు.క్లీనర్ నిరంజన్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.