తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam ) నేపథ్యంలో 11న బ్రేక్ దర్శనాల ( Break Darsanam ) ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు(Recommendation Letters ) కూడా స్వీకరించబడవని ,ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
రామనామస్మరణతో సాగిన అయోధ్యకాండ అఖండ పారాయణం
తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారంఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఆద్యంతం రామనామస్మరణతో సాగింది. ఇందులో ఒకటి నుంచి 3 సర్గల వరకు గల 156 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు అనంత గోపాల కృష్ణ, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు.