తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా మరిన్ని మెరుగైన సేవలందించాలని ధర్మారెడ్డి కోరారు. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.