అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పెదబయలు మండలం ఎగతరాబులో ఈ ఘటన చోటు చేసుకుంది . ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని ఆరోపణలతో బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణారావును మావోయిస్టులు హత్య చేశారు. లక్ష్మణరావు గతంలో మావోయిస్టు దళంలో పని చేసి పోలీసులకు లొంగిపోయాడు.
పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే అనుమానంతోనే మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.