Train Accident | విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేపట్టి.. రాకపోకలను పునరుద్ధరించారు. గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ చేపట్టారు. విశాఖపట్నం -విజయనగరం డౌన్లైన్ ట్రాక్ వైపు గూడ్స్ను మొదట నడిపారు. అనంతరం అదే పట్టాలపై ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు వెళ్లింది. ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 14 మంది వరకు మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. పలు బోగీలు మరో రైలు బోగీలపైకి దూసుకెళ్లాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలపై పడిపోయిన రైలు బోగీలను ప్రొక్లెయిన్, క్రేన్ల సహాయంతో తొలగించి.. విద్యుత్ లైన్ను పునరుద్ధరించారు. మరో వైపు సంఘటనా స్థలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే, మృతుల కుటుంబాలను సైతం పరామర్శించారు.
#WATCH | Andhra Pradesh | The first train plies on the railway track after restoration at the spot of Vizianagaram train derailment accident. pic.twitter.com/x7w6bTLOCw
— ANI (@ANI) October 30, 2023