తిరుమల : కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొలువుదీరిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఓ భక్తుడు గుండెపోటుతో మరణించాడు. గంటల తరబడి క్యూలైన్లో నిలుచుని స్వామివారిని దర్శించుకున్న భక్తుడు లడ్డూ ప్రసాదం కోసం కౌంటర్ వద్ద క్యూ లైన్లో నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడి భక్తులు , సిబ్బంది అతడిని హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సదరు భక్తుడు గుండెపోటుతో మరణించాడని అతడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కాగా భక్తుడి పేరు, ఊరు, పూర్తి వివరాల కోసం పోలీసులు, ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి భద్రపరిచామని పోలీసులు తెలిపారు.