అమరావతి: ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లిన తల్లి,కుమారుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. జిల్లాలోని కారంపుడి పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన అంగడి నాగమ్మ(50), రామకోటేశ్వరరావు(30)అనే ఇద్దరు తల్లి, కొడుకులు గురువారం బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.