అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు( Funeral) వచ్చి ముగ్గురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (Electrocution)గురై అక్కడికక్కడే చనిపోయారు. జిల్లాలోని కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామానికి చెందిన రాణి (65) వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు చేసేందుకు సాయంత్రం గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
శ్మశాన వాటిక వద్ద విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించక పోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి. పాడెను మోస్తున్న రవీంద్రన్, తిరుపతి, మునప్ప అనే ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మృతదేహాలు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.