అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం జిల్లా ( Polavaram District )ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతు అయ్యారు.
గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించారు . అనంతరం ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.ఊకే సుశీల , ఊకే లక్ష్మి, తుర్రం భారతి, ఊకె రమేష్, బాలరాజు ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి సంధ్యారాణి ఘటనపై ఆరా తీశారు.