అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం జిల్లా ( Polavaram District )ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు ( Tribal womens ) గల్లంతయ్యారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతు అయ్యారు. గల్లంతైన మహిళల కోసం గోదావరిలో పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించారు . వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.