అమరావతి : ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి(Entrance house) శ్రీకారం చుట్టింది. అయితే గృహ ప్రవేశ సమయంలో విద్యుత్ఘాతం(Electric shock) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో మహిళను బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.