అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ ఘటనలో పార్వతీపురం గ్రామానికి చెందిన బోగి ప్రసాదరావు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.