అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రణస్థలం మండలం పైడి భీమావరం ఫైఓవర్పై ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీ కొట్టింది. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. నలుగురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులంతా కేరళకు చెందిన యాత్రికులుగా గుర్తించారు.