హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఆయన తన పొలంలో పండిన టమాటను ప్రతిరోజూ మదనపల్లి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. దీంతోపాటు పాల వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు.
మంగళవారం రాత్రి ఆయన పొరుగు గ్రామంలో పాలు పోసి బైక్పై వస్తుండగా దారి కాచిన దుండగులు బైక్నున ఆపి రాజారెడ్డి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టేసి హత్యచేసి పారిపోయారు. టమాటకు ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అతను వాటిని విక్రయించి తెస్తున్న డబ్బులను కాజేయాలన్న ఉద్దేశంతో దండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్టు మదనపల్లి డీఎస్పీ కేశవ్ తెలిపారు.