అమరావతి : లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి కొట్టవద్దని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆటోనగర్ను ఎత్తివేసేందుకు తీసుకొచ్చిన 5,6 జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న ఆటోనగర్ ఏషియన్ కంట్రీలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ పనిచేస్తుందని, ఈ ఆటో నగర్ స్థలాలను కబ్జా చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో ఆటో నగర్కు వ్యతిరేకంగా ఎలాంటి జీవోలు తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఆ జీవోలు ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.