తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం(Sarvadarsan) 24 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd officials) తెలిపారు.
నిన్న స్వామివారిని 70,086 మంది భక్తులు దర్శించుకోగా 28,832 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.17 కోట్లు వచ్చిందని వివరించారు.
తుంబురు తీర్థ ముక్కోటికి ఆర్టీసీ బస్సులు
తిరుమలలో ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగనున్న తుంబురుతీర్థ ముక్కోటికి గాను పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా తిరుమల నుంచి, గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి భక్తుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు, ట్యాక్సీ డ్రైవర్లు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.