తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న స్వామివారిని 86,181 మంది భక్తులు దర్శించుకోగా 30,654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న సందర్భంగా జూన్ 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.