తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు నిండిపోగా టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 69,733 భక్తులు దర్శించుకోగా 28,614 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఆగస్టు 9న శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఆడికృత్తిక
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9 న ఆడికృత్తిక పర్వదినం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు.