తిరుమల : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని నిన్న 69,365 మంది భక్తులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income ) రూ.3.05 కోట్లు వచ్చిందని వివరించారు.
ఆగస్టు 4న డయల్ యువర్ ఈవో
ప్రతి నెల నిర్వహించే డయల్ యువర్ ఈవో ( Dial Your EO) కార్యక్రమం ఆగస్టు 4న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే కార్యక్రమానికి భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నంబర్లో సంప్రదించాలని సూచించారు.