తిరుమల: తిరుమలేశుని దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులను అనుమతిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్లను అధికారులు పునరుద్ధరించారు. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే బైకులను మాత్రం కనుమ దారిగుండా అనుమతి నిరాకరిస్తున్నారు. టికెట్లు ఉన్న భక్తులను దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
కాగా, మెట్ల మార్గాన్ని, కాలినడక రహదారులను మూసివేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి రహదారులు బంద్చేశారు. భారీ వర్షాలకు శ్రీవారిమెట్టు కాలినడక మార్గం దెబ్బతిన్నది. దీంతో పునరుద్ధరణ పనులు చేపట్టింది.