ఐదు వేల నుంచి 8 వేలకు పెంచిన టీటీడీ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెంచింది. ప్రస్తుతం రోజుకు ఐదువేలుగా ఉన్న టోకెన్ల సంఖ్యను ఎనిమిది వేలకు పెంచాలని నిర్ణయించింది. ఆధార్కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాలవారికి టోకెన్లు జారీ చేయనున్నది. సోమవారం నుంచి శ్రీవారి ఏకాంత సేవను రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు.