తిరుమల : తిరుమల(Tirumala) లో మరోసారి డ్రోన్ కెమెరా (Drone camera )ఎగురవేత కలకలం సృష్టించింది. తిరుమలలోని ఘాట్రోడ్డులో 53వ మలుపు వద్ద అసోం ఆర్మీ కమాండర్ కుటుంబం డ్రోన్ కెమెరాతో పరిసరాలను చిత్రీకరించడం వివాదస్పదమవుతుంది . విషయం తెలుసుకున్న టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని భక్తులను విచారిస్తున్నారు.
తిరుమలలో, పరిసర ప్రాంతాలు నో ఫ్లయింగ్ జోన్(No Flying Zone) ఉండడం వల్ల విమానాలుగాని, డ్రోన్ కెమెరాలను వాడడం నిషేదం. శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు ఎగురడంపై గతంలో పలుమార్లు విమానయాన శాఖ అధికారులకు అధికారులకు ఫిర్యాదులు చేసి విమానాలు అటువైపు రాకుండా అడ్డుకున్నారు.