తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. బుధవారం కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) లభిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,712 మంది దర్శించుకోగా 19,902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
జనవరి 5న డయల్ యువర్ ఈవో
ప్రతి నెల నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని జనవరి 5న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.