తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) కొండపై ఉన్న కంపార్టుమెంట్లన్నీ(Compartments) నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 59,808 మంది భక్తులు దర్శించుకోగా 25,618 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.60 కోట్లు వచ్చిందని వివరించారు.
టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణస్వీకారం
తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. ఇటీవల ప్రభుత్వం 24 మంది బోర్డు సభ్యులతో పాటు నలుగురిని ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమించింది. దీంతో ఈవో ధర్మారెడ్డి సభ్యుడిగా ప్రమాణం చేశారు.