తిరుమల : తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు (Ttd Officials)వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,856 మంది భక్తులు దర్శించుకోగా 35,783 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చిందని వివరించారు.
రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను సోమవారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.