తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కంపార్ట్మెంట్లలలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు(Ttd Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 59,392 మంది దర్శించుకోగా 20,714 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
తిరుమలలో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్రన్ నిర్వహించారు. ఆలయం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొని తెప్పల పటిష్టత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ట్రయల్రన్లో ఈఈ జగన్ మోహన్ రెడ్డి, వీజీవో బాలిరెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పోటు పేష్కార్ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.