తిరుమల : కార్తిక మాసం సందర్భంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మూడు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 71,441 మంది భక్తులు దర్శించుకోగా 23,595 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.87 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.