తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. గోవిందా నామస్మరణతో తిరుమలగిరులు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో తిరుమలలోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 73,572 మంది భక్తులు దర్శించుకోగా 29,448 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.73 కోట్లు వచ్చిందని వివరించారు.
జులై 3న 3న పౌర్ణమి గరుడ సేవ
గురు పౌర్ణమి((Guru Pournami) సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవజరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.