తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 29 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd Officers) తెలిపారు. నిన్న స్వామివారిని 81,833 మంది భక్తులు దర్శించుకోగా 33,860 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చిందన్నారు.
బర్డ్ ట్రస్ట్కు రూ. 10 లక్షలు విరాళం
ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బర్డ్ ట్రస్ట్(Bird Trust) కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించింది.టీటీడీ పరిపాలన భవనంలో ఇందుకు సంబంధించిన డీడీని సంస్థ తిరుపతి ప్రతినిధి రాఘవేంద్ర ఈవో ఎవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డప్ప రెడ్డి పాల్గొన్నారు.