తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వ దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,879 మంది భక్తులు దర్శించుకోగా 29,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చిందని వివరించారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళం
ముంబైకి చెందిన ఎమ్మెస్.సుందరం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. దాత తరపున తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.