తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో 22 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లులేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు ( TTD Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 76,254 మంది భక్తులు దర్శించుకోగా 28,091 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.4.90 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. బెంగళూరుకు చెందిన ఎన్న్.టి.నటరాజన్ అనే భక్తుడు ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళం (Donation) గా ఇచ్చారు. తిరుమలలోని దాతల విభాగం కార్యాలయంలో సూపరింటెండెంట్ ఈశ్వరయ్యకు ఈ మేరకు విరాళం చెక్కును అందించారు.