తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి సర్వదర్శనానికి మూడు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 67,043 మంది భక్తులు దర్శించుకోగా 22,112 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ.3.43 కోట్లు వచ్చిందని వివరించారు. కాగా ఈ నెల 23 నుంచి వైకుంఠ ఏకాదశి, 24న వైకుంట ద్వాదశి సందర్భంగా రేపు శుక్రవారం సర్వదర్శన టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర ద్వారా దర్శన టోకెన్లు జారీచేయనున్నామని వివరించారు.