అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో చేబ్రోలు సమీపంలో కాల్పుల కలకలం రేపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీపై రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. ఒక తూట సైడ్ మిర్రర్ను తాకుతూ వెళ్లడంతో డ్రైవర్ తప్పించుకున్నారు. విశాఖ నుంచి ఎలమంచిలి నుంచి అమలాపురం వెళ్తుండగా జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. డ్రైవర్ అప్రమత్తమై వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండానే అక్కడి నుంచి లారీ డ్రైవర్ వెళ్లిపోయారు.