కడప: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప శివారులోని రిమ్స్ రోడ్డులో రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. యువకులు కడపకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ధాటికి బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.