అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. హుబ్లీ నుంచి నర్సాపూర్, విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట వరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. ఈ రైళ్లను కేంద్ర మంత్రి (Union Minister) కిషన్రెడ్డి ( Kishan reddy) ప్రారంభిస్తారని గురువారం వెల్లడించారు.
అదే విధంగా కాకినాడ టౌన్, నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07487/07488 అనే నంబర్లు గల ప్రత్యేక రైలు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2.25కు నాందేడ్లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6.30కు కాకినాడలో బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 నాందేడ్కు చేరుకుంటుదన్నారు.
ఈ రైలు బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం,కొండపల్లి, రాయనపాడు, ఏలూరు. రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు.