Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు మంగళవారం విశాఖకు వెళ్లారు. అక్కడి స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు