అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా కారు కోడుమూరు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మృతుల్లో మిడుతూరు మండలం అలగనూరు వాసులైన తండ్రీ కుమారుడు యలమరాజు, నారాయణ, కర్నూలు జిల్లా తొగర్పేడు వాసి వెంకటస్వామిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.